వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గద్దర్ ను కలుపుకొని పోతాం: ఎంపీ వివేక్

By Staff
|
Google Oneindia TeluguNews

Vivek
హైదరాబాద్‌: కె.కేశవరావు ఇంట్లో తెలంగాణకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ జరిగింది. భేటీలో అదిలాబాద్ లో ఈ నెల 10న నిర్వహించే తెలంగాణ ఆమరవీరుల సంస్మరణ సభ పై చర్చించారు. ఆ రోజు నిర్వహించాల్సిన సభ కోసం కసరత్తు చేశారు. తెలంగాణకోసం కొత్తగా విప్లవ నాయకుడు గద్దర్ పెట్టిన పార్టీపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ కోసం గద్దర్ తోపాటు ఎవరితో వెళ్లడానికైనా నారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందరూ ఐక్యంగా ఉండి తెలంగాణ సాధించుకోవాలని తీర్మానించారు. తెలంగాణ ఉద్యమానికి రానున్న రోజుల్లో తెరాస, భాజపా, టిడిపిలకన్నా ఎక్కువగా పోరాడాల్సి ఉందని, ఉద్యమాన్ని కాంగ్రెస్ చేతుల్లోకి తీసుకోవడానికి ఏం చేయాలో చర్చించినట్లు సమాచారం. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ యాక్షన్ ఫోరం ఫర్ తెలంగాణను స్థాపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసం ఈ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పోరాడుతుంది.

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎవరితోనైనా కలిసి పోరాడటానికైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. గద్దర్ తోపాటు ఎవరు తెలంగాణ కోసం చిత్తశుద్దితో ముందుకు వచ్చినా కలుపుకొని పోతామని వివేక్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అదిలాబాద్ లో జరిగే అమరవీరుల సభలో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. తాము జరుపుతున్న సభలు అధిష్టానం ఆమోదంతోనే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు. వీరప్ప మొయిలీ, ప్రణభ్ ముఖర్జీలకు చెప్పి ఈ సభలు నిర్వహిస్తున్నామని, ఆర్ధిక సహాయానికి కూడా కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని వివేక్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X