హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమ సంస్థకు ఆంధ్రావారితో చర్చలా?: గద్దర్ కు ప్రశ్నలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ ఏర్పాటు చేయదలిచిన ప్రజా ఫ్రంట్ పై ప్రశ్నల వర్షం ప్రారంభమైంది. ఉద్యమ సంస్థ కోసం ఆంధ్రావారితో చర్చలెందుకని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ తిరుమలి ప్రశ్నించారు. సీమాంధ్ర నాయకులను కలుపుకుని పోతామని గద్దర్ చెప్పడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గద్దర్ ప్రజా ఫ్రంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నామంటూనే ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఫ్రంట్ విధానాలపై తమకు అనుమానాలున్నాయని ఆయన అన్నారు.

ఫ్రంట్ విధానాలపై తనకు తీవ్ర అభ్యంతరాలున్నాయని, ముసాయిదా ఉద్యమ సంస్థ ముసాయిదా మాదిరిగా కాకుండా రాజకీయ ముసాయిదా మాదిరిగా ఉందని ఆయన అన్నారు. ఏ వర్గంవారితో గద్దర్ ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు గద్దర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X