నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కు నేదురుమల్లి మనుషులే సహకరిస్తున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
నెల్లూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సహకరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న నాయకులంతా నేదురుమల్లి వర్గానికి చెందినవారేనని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. జగన్ కు నేదురుమల్లి మనుషులే సహకరిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. నెల్లూరు జిల్లాలో నేదురమల్లి చక్రం తిప్పిందీ లేదు, సమస్యను పరిష్కరించిందీ లేదని ఆయన అన్నారు.

జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గోపాల్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోదని, వారిని పార్టీ నుంచి తొలగించాలని ఆయన అన్నారు. వారు పార్టీకి చేసిందేమీ లేదని ఆయన అన్నారు. కాగా, ఈ ఇద్దరు నాయకులపై ఇప్పటికే పార్టీ నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ భూస్థాపితమవుతుందనే శాసనసభ్యురాలు కొండా సురేఖ మాటలను ఆనం వివేకానంద రెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెసు ఎప్పటికీ భూస్థాపితం కాదని ఆయన అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించడాన్ని ఆయన సమర్థించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X