హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై చంద్రబాబు అనుమానాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన ఆ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గద్దర్ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయడం వెనక ఎవరున్నారనే విషయంపై ఆయన ఆరా తీశారు. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను ఎందుకు ఏర్పాటు చేశారని ఆయన పార్టీ నాయకులను అడిగారు.

ఈ నెల 9వ తేదీన గద్దర్ ఫ్రంట్ విధివిధానాలు వెల్లడవుతాయని పార్టీ నాయకులు ఆయనకు చెప్పారు. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై స్పష్టత వచ్చే వరకు దానిపై మౌనంగా ఉండాలని, ఎవరు కూడా మాట్లాడకూడదని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించారు. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటుపై పొలిట్ బ్యూరోలో విస్తృతంగా చర్చించారు. కాగా, పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరగలేదని తెలుస్తోంది. ప్రజాఫ్రంట్ పై నాగం జనార్దన్ రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతోనే ఆయన సమావేశం మధ్యలో లేచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X