హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపి వైయస్ జగన్ ఓదార్పు యాత్రనే పిసిసి టార్గెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రనే లక్ష్యంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)నాయకత్వం చర్యలకు పూనుకుంది. జగన్ వర్గానికి చెందిన నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడంలో, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించడంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రను దెబ్బ తీయడమే ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పిసిసి క్రమశిక్షణా చర్యలను ప్రశ్నిస్తూ వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రికలో ఓ వార్తాకథనం కూడా ప్రచురితమైంది. చర్యలు తీసుకోవడం వెనక వైయస్ జగన్ ఓదార్పు యాత్రను దెబ్బ తీయాలనే ఉద్దేశమే ఉందని సాక్షి దినపత్రిక అభిప్రాయపడింది. క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నట్లు కూడా ఆరోపించింది.

కాగా, వైయస్ జగన్ కు చెందిన నాయకులపై మరింత పెద్ద యెత్తున చర్యలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీన ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తాను తొలగించాలనుకుంటున్న మంత్రుల జాబితాతో పాటు కొత్తగా తాను తీసుకోబోయే మంత్రుల జాబితాతో ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటించిన బాలినేని శ్రీనివాస రెడ్డికి ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. అలాగే, సబితా ఇంద్రారెడ్డి నుంచి హోం మంత్రిత్వ శాఖను తీసేసి మరో శాఖను ఆమెకు అప్పగిస్తారని చెబుతున్నారు.

ఈ నెలాఖరులోగా వైయస్ జగన్ గందరగోళానికి తెర వేయాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే పిసిసి క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X