నయనతార పెళ్లికి చెక్: ప్రభుదేవా భార్య రమలత్ మరో పిటిషన్
నయనతారకు దగ్గరైనప్పటి నుంచి ప్రభుదేవా ఇంటికి సరిగా రావడం లేదని, తననూ పిల్లలనూ గాలికి వదిలేశాడని ఆమె ఆరోపించారు. తనకు ముగ్గురు కొడుకులు పుట్టారని, వారిలో ఒక కొడుకు క్యాన్సర్ తో మరణించాడని ఆమె చెప్పారు. పైగా, విడాకులు ఇవ్వడానికి తనకు నయనతార 3.85 కోట్ల రూపాయలు ఇచ్చి ఒప్పందం కుదిర్చినట్లు వార్తలు వచ్చాయని, ఇది మరింతగా కలత పెట్టేదిగా ఉందని ఆమె అన్నారు. ప్రభుదేవాకు, రమలత్ కు మధ్య 1995 సెప్టెంబర్ 8వ తేదీన వివాహం జరిగింది.
Story first published: Wednesday, October 6, 2010, 15:53 [IST]