చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయనతార పెళ్లికి చెక్: ప్రభుదేవా భార్య రమలత్ మరో పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramalath
చెన్నై: నటుడు ప్రభుదేవా, నటి నయనతారల పెళ్లికి బ్రేకులు వేసేందుకు ప్రభుదేవా భార్య రమలత్ పూనుకున్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో తాజాగా ఆమె రెండో పిటిషన్ దాఖలు చేశారు. తాను వేసిన మొదటి పిటిషన్ పై తీర్పు వెలువడే వరకు నయనతారను తన భర్త ప్రభుదేవా పెళ్లి చేసుకోకుండా ఆపాలని ఆమె ఫ్యామిలీ కోర్టును కోరారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె తన రెండో పిటిషన్ లో కోరారు. తనతో కలిసి ఉండాలని ప్రభుదేవాను ఆదేశించాలని రమలత్ ఇంతకు ముందు పిటిషన్ దాఖలు చేశారు. విల్లు సినిమాకు దర్శకత్వం వహించిన సమయంలో నయనతారకు తన భర్త ప్రభుదేవా దగ్గరైనట్లు ప్రచారం జరిగిందని, వారిద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయని ఆమె ఇంతకు ముందు పిటిషన్ లో చెప్పారు.

నయనతారకు దగ్గరైనప్పటి నుంచి ప్రభుదేవా ఇంటికి సరిగా రావడం లేదని, తననూ పిల్లలనూ గాలికి వదిలేశాడని ఆమె ఆరోపించారు. తనకు ముగ్గురు కొడుకులు పుట్టారని, వారిలో ఒక కొడుకు క్యాన్సర్ తో మరణించాడని ఆమె చెప్పారు. పైగా, విడాకులు ఇవ్వడానికి తనకు నయనతార 3.85 కోట్ల రూపాయలు ఇచ్చి ఒప్పందం కుదిర్చినట్లు వార్తలు వచ్చాయని, ఇది మరింతగా కలత పెట్టేదిగా ఉందని ఆమె అన్నారు. ప్రభుదేవాకు, రమలత్ కు మధ్య 1995 సెప్టెంబర్ 8వ తేదీన వివాహం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X