హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిలో వెలుగు చూసిన మరో డ్రగ్స్ రాకెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ లో మరో సెక్సు రాకెట్ బయటపడింది. మంగళవారం సాయంత్రం మసాబ్ ట్యాంక్ వద్ద పశ్చిమ మండలం పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలతో పాటు నైజీరీయా, కెన్యాలకు చెందిన కొందరిని ఏజెంట్లుగా పెట్టుకొని కెన్యాకు చెందిన రాక్సీ అనే అతడు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఇతడు తన వ్యాపారాన్ని ఇంటర్ నెట్ ద్వారా నడిపిస్తుంటాడు. ఎవరికైనా కస్టమర్లకు డ్రగ్స్ కావాలంటే తన ఎకౌంట్ లో డబ్బులు పడగానే స్థానికంగా ఉన్న తన ఏజెంటును పంపి డ్రగ్స్ ను అందజేస్తాడు.

ఇటీవల సినీహీరోలు రవితేజ తమ్ముళ్లకు డ్రగ్స్ సరఫరా చేసిన చిమా క్లెమంట్ అనేవాడు రాక్సీకి ఏజెంటు. క్లెమెంట్ దగ్గర డ్రగ్స్ రాకెట్ సమాచారం తెలుసుకున్న పోలీసులు రాక్సీని పట్టుకోవడానికి ఇన్నాళ్లు చూశారు. అయితే అతను హైదరాబాద్ లో లేక పోవటంతో వీలుకాలేదు. అయితే మంగళవారం హైదరాబాద్ వచ్చాడని తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

కాగా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశస్తులైన అన్నదమ్ములను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నైజీరియాకి చెందిన వీరు అన్నదమ్ములగా పోలీసులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి కొకైన్ విక్రయాలు మొదలుపెట్టారు. ఆగస్టులో పోలీసులకు పట్టుబడ్డ నైజీరియా దేశస్తుడు ఒకేచుక్వు ఒహాజురికే సమాచారం మేరకు నిఘా ఉంచగా, మంగళవారం దాడిచేసి ఇద్దరినీ అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X