హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీతాల గొడవ: ఆందోళన బాటలో శ్రీచైతన్య తెలంగాణ లెక్చరర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ పేరుతో వివక్ష చూపుతూ జీతాలు ఇవ్వని శ్రీ చైతన్య కళాశాన ఎదుట తెలంగాణ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. ఇసిఐఎల్ లోని శ్రీ చైతన్యలో లెక్చరర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ అనే లెక్చరర్ కు మూడు నెలలుగా వేతనం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తూ ధర్నాని నిర్వహిస్తున్నారు. తాము ధర్నా చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించక పోవటంతో వారు ఆందోళను మరింత ఉధృతం చేస్తున్నారు. లెక్చరర్స్ చేస్తున్న అందోళనకు తెరాసతోపాటు, చైతన్య కళాశాల విద్యార్థులతో పాటు స్థానికంగా ఉన్న ఇతర కళాశాల విద్యార్థులు కూడా మద్దతు పలుకుతున్నారు.

హైదరాబాద్ లోని ఆంధ్ర కళాశాలల్లో తెలంగాణ పేరుతో వివక్ష చూపుతున్నారని ఆందోళన చేస్తున్న లెక్చరర్స్ ఆరోపిస్తున్నారు. యాజమాన్యాలు తెలంగాణ లెక్చరర్లను లెక్చరర్ లా చూడకుండా ఓ పనివాడిగా చూస్తున్నాయంటున్నారు. తమ నుండి శ్రమదోపిడి చేయించుకుంటున్నారన్నారు. కాగా ధర్నా ఉద్రిక్తం అయ్యే సూచనలు కనిపించటంతో పోలీసులను మోహరించే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X