హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్ విమానాశ్రయంలో గంటల కొద్దీ చంద్రబాబు నిరీక్షణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికీ నిరీక్షణ తప్పలేదు. తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే వాతావరణం అనుకూలించక పోవటంతో రాజమండ్రి వెళ్లాల్సిన కింగ్ ఫిషర్ ఫ్లైట్ ను అధికారులు అనుమతించలేదు.

చంద్రబాబు నాయుడు అదే ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన గురువారం ఉదయం తొమ్మిది గంటలనుండి విమానాశ్రయంలోనే నిరీక్షిస్తున్నారు. ఈ వార్త రాసేటప్పటి వరకు ఉదయం 11 గంటల వరకు కూడా ఆయన లాంజ్ లోనే నిరీక్షిస్తూ కూర్చున్నారు. గురువారం నుంచి చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఈ పర్యటన నిమిత్తం కింగ్ ఫిషర్ విమానంలో రాజమండ్రి వరకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో తీవ్ర జాప్యం ఏర్పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X