వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిజన మహిళ పై చెయ్యెత్తిన చంద్రబాబుని తరిమి కొట్టిన గ్రామస్తులు

|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కాకినాడ: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ఆరేళ్లకు పైగా విపక్షనేతగా కొనసాగుతున్న చంద్ర బాబు గిరిజన మహిళల చైతన్యాన్ని సుతరామూ సహించలేకపోయారు. నన్నే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. గదమాయించి వారి నోరు మూయించేందుకు విఫలయ్నం చేశారు. కుదరక పోవడంతో ఒక్కసారిగా సహనం కోల్సాయారు.

తూర్సు గోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతాలలో పర్యటించిన టిడిపి అథినేత చంద్రబాబు నాయుడుకు పరాభవం జరిగింది. పత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో మైనింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు పై స్థానిక మహిళలు తిరగబడ్డారు. మీకు అన్యాయం జరుగుతుందంటూ గొంతు చించుకున్న చంద్రబాబును వారు ఎదిరించారు. దీంతో సహనం కోల్పోయిన చంద్రబాబు వారి గ్రామానికి వెళ్లి వారికే సంబంధం లేదని నోటికి వచ్చినట్లు మాట్లాడి వారిపై చెయ్యి చేసుకొన్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు చంద్రబాబు ఊరు విడిచి వెళ్ళేవరకు తరిమి కొట్టారు. అయితే ఇదే వంతాడ మైనింగ్ లీజు టిడిపి అధికారంలో ఉండగానే జరగడం విశేషం...వారి ప్రభుత్వంలో జరగని అన్యాయం వేరే వారు అధికారంలో ఉన్నపుడు జరుగుతుందనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు రాజకీయవేత్తలు స్పందిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X