వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గిరిజన మహిళ పై చెయ్యెత్తిన చంద్రబాబుని తరిమి కొట్టిన గ్రామస్తులు
తూర్సు గోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతాలలో పర్యటించిన టిడిపి అథినేత చంద్రబాబు నాయుడుకు పరాభవం జరిగింది. పత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో మైనింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు పై స్థానిక మహిళలు తిరగబడ్డారు. మీకు అన్యాయం జరుగుతుందంటూ గొంతు చించుకున్న చంద్రబాబును వారు ఎదిరించారు. దీంతో సహనం కోల్పోయిన చంద్రబాబు వారి గ్రామానికి వెళ్లి వారికే సంబంధం లేదని నోటికి వచ్చినట్లు మాట్లాడి వారిపై చెయ్యి చేసుకొన్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు చంద్రబాబు ఊరు విడిచి వెళ్ళేవరకు తరిమి కొట్టారు. అయితే ఇదే వంతాడ మైనింగ్ లీజు టిడిపి అధికారంలో ఉండగానే జరగడం విశేషం...వారి ప్రభుత్వంలో జరగని అన్యాయం వేరే వారు అధికారంలో ఉన్నపుడు జరుగుతుందనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు రాజకీయవేత్తలు స్పందిస్తున్నారు.
Comments
Story first published: Saturday, October 9, 2010, 12:51 [IST]