వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవి పంది అనుకుని ఓ వ్యక్తిని కాల్చి చంపి, లొంగిపాయాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శనివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో మరో వ్యక్తి మరణించాడు. జిల్లాలోని రెక్కలకొండ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంత మంది నాటు తుపాకులతో అడవి పందుల వేటకు వెళ్లారు. వారిలో రెడ్డప్ప అనే రైతు చప్పుడు కావడంతో అడవి పంది అనుకుని కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎర్రయ్య అనే వ్యక్తి మరణించాడు.

ఎర్రయ్య మరణంతో గ్రామమంతా విషాదం చోటు చేసుకుంది. తాను జరిపిన కాల్పుల్లోనే మరణించాడంటూ రెడ్డప్ప పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. చేలకు నష్టం కలిగిస్తున్న అడవి పందుల వేటను కొనసాగించడం చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉంది. అలా నాటు తుపాకులతో కాల్పులు జరినప్పుడు వ్యక్తులు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మరణం సంభవించడం ఇదే మొదటిసారి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X