చిరంజీవికి పద్మభూషణ్ రాజకీయమే: నందుల గొడవ

తాము మండలి సమావేశంలో చేసిన తీర్మానాలపై సంతకం పెట్టడానికి సమయం లేని శ్యాంప్రసాద్ రెడ్డి ఐదుగురి నిర్ణయంపై సంతకం చేసే సమయం మాత్రం దొరికిందా అని ఆయన అడిగారు. ఎవరినైనా సస్పెండ్ చేసేటప్పుడు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ పద్ధతి శ్యాంప్రసాద్ రెడ్డి పాటించలేదని ఆయన విమర్సించారు. పద్మభూషణ్ అవార్డుల్లో కూడా రాజకీయం ఉందని ఆయన అన్నారు. రాజకీయం చేసి దాసరి నారాయణ రావు ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారని, ఆ అవార్డు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజాకు రావాల్సి ఉందని ప్రజారాజ్యం కార్యకర్తలు విమర్శలకు దిగారు. దీంతో నట్టి కుమార్ దాసరిని సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. మీడియాతో ఎందుకు మాట్లాడకూడదని నట్టికుమార్ శ్యాంప్రసాద్ రెడ్డిని ఆదివారం అడిగారు. దాసరికి నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
చిరంజీవి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా, ఇళ్లు తగలబెడతారా అని ఆయన అడిగారు. వారికి తాను భయపడేది లేదని ఆయన అన్నారు. తాను చేతులు ముడుచుకుని కూర్చోబోనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తనను నిర్మాతల మండలి నుంచి సస్పెండ్ చేస్తే తామంతా సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications