తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు చిత్తూరు డిసిసి షాక్: చెవిరెడ్డిపై పిసిసికి ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chevireddy
తిరుపతి: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ షాక్ ఇచ్చింది. జగన్ వర్గానికి సంబంధించిన తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పిసిసికి ఫిర్యాదు చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కు ఫిర్యాదు చెసినట్లు జిల్లా కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

నెల్లూరు, తిరుపతి, కడప తదితర పలు జిల్లాల్లో జగన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో జగన్ వర్గానికి సంబంధం లేని జిల్లా స్థాయి నాయకులు ఓదార్పును ఆనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని స్పందించటం లేదు. కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర పై స్థాయి నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా జిల్లాస్థాయి నాయకులు ఓదార్పుకు వ్యతిరేకంగా మాట్లాడకున్నప్పటికీ ఆయన వర్గానికి చెందిన చెవిరెడ్డిపై విమర్శలతో సరిపెట్టకుండా ఏకంగా పిసిసికి ఫిర్యాదు చేస్తామని చెప్పటంతో తిరుపతి జగన్ వర్గ కాంగ్రెస్ సభ్యులు కంగుతిన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X