జగన్ కు చిత్తూరు డిసిసి షాక్: చెవిరెడ్డిపై పిసిసికి ఫిర్యాదు
నెల్లూరు, తిరుపతి, కడప తదితర పలు జిల్లాల్లో జగన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో జగన్ వర్గానికి సంబంధం లేని జిల్లా స్థాయి నాయకులు ఓదార్పును ఆనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని స్పందించటం లేదు. కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర పై స్థాయి నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా జిల్లాస్థాయి నాయకులు ఓదార్పుకు వ్యతిరేకంగా మాట్లాడకున్నప్పటికీ ఆయన వర్గానికి చెందిన చెవిరెడ్డిపై విమర్శలతో సరిపెట్టకుండా ఏకంగా పిసిసికి ఫిర్యాదు చేస్తామని చెప్పటంతో తిరుపతి జగన్ వర్గ కాంగ్రెస్ సభ్యులు కంగుతిన్నారు.
Story first published: Monday, October 11, 2010, 15:29 [IST]