వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ కర్నాటకం: రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భరద్వాజ్ సిఫార్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

Karnataka Vidana Soudha
బెంగళూర్: కర్ణాటక రాజకీయ సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, అందుకే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశానని భరద్వాజ్ చెప్పారు. విశ్వాస పరీక్ష ఓ ప్రహసనంగా మారిందని ఆయన అన్నారు. బయట వ్యక్తులు సభ లోపలికి వచ్చారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు వ్యతిరేకంగా శాసనసభలో 120 మంది శాసనసభ్యులున్నారని ఆయన చెప్పారు. పైగా 16 మంది శాసనసభ్యులను కారణం లేకుండా స్పీకర్ బోపయ్య అనర్హులుగా ప్రకటించారని ఆయన తప్పు పట్టారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సోమవారం ఉదయం మూజువాణీ ఓటుతో యెడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయం తెలిసిందే.

కాగా, ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి కాంగ్రెసు, జెడిఎస్ లు ప్రయత్నించాయని ముఖ్యమంత్రి యెడ్యూరప్ప విమర్శించారు. అసమ్మతి శాసనసభ్యులకు 20 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. మనీ పవర్ ను వెలికి తీయడానికి విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా 16 మంది శాసనసభ్యులు కోర్టుకెక్కిన విషయాన్ని కూడా భరద్వాజ్ తన లేఖలో తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X