వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప జిల్లాలో భార్య గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్న భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

Cuddapah
కడప: భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లా చెట్వెల్ మండలం కెఎస్ అగ్రహారంలో కొండయ్య అనే యువకుడు భార్య రాధ గొంతుకోసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. భార్య చెప్పపెట్టకుండా పుట్టింటికి రావడంతో అవమానానికి గురై అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. వారిద్దరికి నెల రోజుల క్రితమే పెళ్లయింది.

భార్య చెప్పాపెట్టకుండా పుట్టింటికి రావడంతో సొంత ఊరిలో అవమానాలు భరించలేక తాను అత్తింటికి వచ్చాడు. రాత్రి భార్యాభర్తలిద్దరు ఓ గదిలో పడుకున్నారు. అయితే కొండయ్య భార్య గొంతు కోసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చేతికి కొండయ్య రాసి పెట్టిన సూసైడ్ నోటు దొరికింది. అవమానం భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X