వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఢిల్లీకి: ముఖ్యమంత్రి రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి ముందు ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై ఆయన స్పందించారు. కేబినెట్ విస్తరణ కోసం అధిష్టానం ఆలోచన మేరకు మరోమారు ఢిల్లీ పర్యటన ఉంటుందని ఆయన చెప్పారు. అధిష్టానానికి అనుగుణంగానే నడుచుకుంటానని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ సంస్థల ఆగడాలు శృతిమించుతున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకు రుణాలు అందరికీ అందుబాటులో లేక పోవటం వల్లనే మైక్రో పైనాన్స్ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించినట్లు చెప్పారు. మైక్రో ఫైనాన్స్ లను నిషేధిస్తే సామాన్యులు ఇబ్బందులు పడవలసి వస్తుందేమోనని ఆయన అబిప్రాయం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ దారుణాలపై ప్రధానికి వివరించానని చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాపై ప్రధానితో చర్చించానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్య తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానిలతో సమావేశమయి పోలవరం జాతీయ హోదా, మైక్రో ఫైనాన్స్ ఆగడాలు, మంత్రివర్గ విస్తరణ, ఉద్యోగులు పీఆర్సీ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను చర్చించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X