హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమిటీ నివేదిక ఎవరికి అనుకూలం?: రోశయ్యతో దుగ్గల్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal and Rosaiah
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది చెప్పలేమని కమిటీ సభ్య కార్యదర్సి వికె దుగ్గల్ అన్నారు. వికె దుగ్గల్ బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. తమకు అందించిన సహకారానికి దుగ్గల్ రోశయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ క్షేత్రస్థాయి పర్యటన పూర్తయింది. ఈ స్థితిలో ఆయన ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు ఇంకా కొంత సమాచారం కావాల్సి ఉందని, దాన్ని అందించాలని ఆయన ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం. కాగా, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్నారు. కమిటీ నివేదిక ఎవరికి అనుకూలంగా ఉంటుందో చెప్పలేమని దుగ్గల్ అన్నారు.

మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా తమ నివేదిక ఉంటుందని ఆయన చెప్పారు. గడువులోగా నివేదిక ఇస్తామని ఆయన అన్నారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగానే నివేదిక ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రికి దుగ్గల్ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X