వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా రోజున సీతారాముల కళ్యాణం చేస్తున్న భీమభక్తునిపాలెం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kakinada
కాకినాడ: దేశవ్యాప్తంగా దసరా రోజున కనకదుర్గా అమ్మవారికి పూజలు చేసి అంబరాన్ని అంటే విధంగా సంబరాలు చేసుకుంటారు. దసరా రోజును అమ్మవారు రాక్షసుడైన మహిషాసురుని చంపిన రోజుగాను కొందరు, పంచపాండవులు తమ అరణ్యవాస సమయంలో తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై పెట్టి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ జమ్మి చెట్టునుండి పూజలు చేసి ఆయుధాలు తీసిన రోజునే దసరాగా మరికొందరు అంటారు. రెండింటిని నమ్మిన వారూ ఉన్నారు.

అయితే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలోని భీమభక్తునిపాలెం గ్రామస్తులు దసరా రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు. అదేంటి అంటే ఇది తమకు అనాదిగా వస్తున్న ఆచారం అంటారు. కొన్ని సంవత్సరాలుగా తాత ముత్తాతలనుండి తాము దసరా రోజున సీతారాముల కళ్యాణం చేస్తామంటున్నారు. చుట్టపక్కల గ్రామస్తుల అది తప్పు అని చెప్పినప్పటికీ తప్పో ఒప్పో తమకు తెలియదని తమ సంప్రదాయం కొనసాగిస్తున్నామంటారు వారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X