పాట్నా:
బీహార్
రాష్ట్రంలోని
ఓ
దుర్గా
ఆలయంలో
తొక్కిసలాట
జరగటంతో
10
మంది
మృత్యువాత
పడగా,
పలువురికి
తీవ్ర
గాయాలయ్యాయి.
చనిపోయిన
వారిలో
నలుగురు
మహిళలు
కూడా
ఉన్నారు.
ఈ
దుర్ఘటన
బంకా
జిల్లాలోని
తిల్దిహా
గ్రామంలో
జరిగింది.
ఈ
గ్రామం
రాజధాని
పాట్నా
నగరానికి
సుమారు
200
కిలోమీటర్ల
దూరంలో
ఉంటుంది.
ఆదివారం
నవరాత్రి
ఉత్సవాల
సందర్భంగా
అమ్మవారిని
బలివ్వడానికి
సుమారు
30వేల
మంది
భక్తులు
మేకలతో
పాటు
శనివారం
రాత్రికే
చేరుకున్నారు.
అయితే
ఆదివారం
ఉదయం
ఈ
సంఘటన
జరిగింది.
దీంతో
దుర్గా
ఆలయం
వద్ద
విషాద
ఛాయలు
నెలకొన్నాయి.
గాయాలయిన
భక్తులను
దగ్గరలోని
ఆసుపత్రికి
చికిత్స
నిమిత్తం
పంపించారు.
కాగా
సీనియర్
పోలీసు
అధికారులు
పరిస్థితిని
చక్కదిద్దడానికి
ఆలయ
ప్రాంతానికి
చేరుకున్నారు.