వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ దుర్గా ఆలయంలో 10 మంది భక్తులు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bihar
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ఓ దుర్గా ఆలయంలో తొక్కిసలాట జరగటంతో 10 మంది మృత్యువాత పడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన బంకా జిల్లాలోని తిల్దిహా గ్రామంలో జరిగింది. ఈ గ్రామం రాజధాని పాట్నా నగరానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదివారం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని బలివ్వడానికి సుమారు 30వేల మంది భక్తులు మేకలతో పాటు శనివారం రాత్రికే చేరుకున్నారు. అయితే ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. దీంతో దుర్గా ఆలయం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. గాయాలయిన భక్తులను దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. కాగా సీనియర్ పోలీసు అధికారులు పరిస్థితిని చక్కదిద్దడానికి ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X