వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై సమీక్షించలేదు: ఆనం రామనారాయణ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Ramnarayana Reddy
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రపై అధికారుల సమావేశంలో విశ్లేషించలేదని జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఓదార్పు గురించి తానసలు మాట్లాడనని తేల్చి చెప్పారు. మెక్రో సంస్థలపై ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై శనివారమిక్కడ అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిదులతో మాట్లాడారు.

అధికారులతో జరిపిన భేటీలో ఓదార్పు యాత్రకు సంబంధించిన ప్రస్తావనే రాలేదన్నారు. అసలు ఆ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తొలి నుంచి అనుసరిస్తున్న వైఖరినే ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. తన కుటుంబంపై గోనె ప్రకాశ్‌రావు చేసిన విమర్శలను ప్రస్తావించగా ' గోనె ప్రకాశ్‌రావు వ్యాఖ్యలపై కూడా స్పందించాలా? ఆయన కేడర్ ఏమిట'ని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X