గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే దాకా హైకోర్టు బెంచ్ ఏర్పాటు పెండింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
గుంటూరు: విజయవాడ - గుంటూరు మధ్యలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరూతూ ఇద్దరు లాయర్లు నిరాహార దీక్షకు సిద్దమయ్యారు. ఈ విషయాన్ని లాయర్లు తెనాలిలో విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. గత కొంత కాలంగా హైకోర్టు బెంచ్ కోసం తాము కొన్నేళ్లుగా పోరాడుతన్నా ప్రభుత్వం స్పందించనందునే తాము నిరాహార దీక్షకు సిద్ధమయినట్లు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు ఆగాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య తమతో చెప్పారని ఆయన తెలిపారు. తాము జై ఆంధ్ర ఉద్యమం చేయడం లేదని, రాజధాని కోసం పోరాటం చేయడం లేదని, కేవలం హైకోర్టు బెంచ్ మాత్రమే అడుగుతున్నామని, అందువల్ల శ్రీకృష్ణ కమిటీతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.

అయితే తమ పోరాటం మహాత్మా గాంధీ చూపించిన అహింసాయుతంగానే సాగుతుందని, ఎక్కడా హింసాత్మకం చోటు చేసుకోదని చెప్పారు. తమకు హైదరాబాద్ చాలా దూరంలో ఉందని, కోర్టు కేసుల కోసం అంతదూరం రావడం కష్టంగా ఉందన్నారు. లాయర్లకు మాత్రమే కాకుండా కక్షిదారులు అందులోనూ బీదవారు అంత దూరం రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కారణంగానే బెంచ్ ఏర్పాటును కోరితే సరియైన స్పందనే లేదని వాపోయారు. తమ బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చే వరకు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తామని, ఇద్దరితో పాటు మరికొందరు నిరాహార దీక్షకు కూర్చునే ఆస్కారం ఉందని చెప్పారు.

కాగా, సీమాంధ్ర లాయర్ల ఆందోళనకు పార్లమెంటు సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. న్యాయవాదుల దీక్ష శిబిరంలో ఆయన వారికి సంఘీభావం తెలుపుతూ కూర్చుకున్నారు. న్యాయవాదులు తెనాలి కోర్టుకు తాళం వేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేవరకు తమ ఆందోళన సాగుతుందని లాయర్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X