శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే దాకా హైకోర్టు బెంచ్ ఏర్పాటు పెండింగ్
అయితే తమ పోరాటం మహాత్మా గాంధీ చూపించిన అహింసాయుతంగానే సాగుతుందని, ఎక్కడా హింసాత్మకం చోటు చేసుకోదని చెప్పారు. తమకు హైదరాబాద్ చాలా దూరంలో ఉందని, కోర్టు కేసుల కోసం అంతదూరం రావడం కష్టంగా ఉందన్నారు. లాయర్లకు మాత్రమే కాకుండా కక్షిదారులు అందులోనూ బీదవారు అంత దూరం రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ కారణంగానే బెంచ్ ఏర్పాటును కోరితే సరియైన స్పందనే లేదని వాపోయారు. తమ బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చే వరకు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తామని, ఇద్దరితో పాటు మరికొందరు నిరాహార దీక్షకు కూర్చునే ఆస్కారం ఉందని చెప్పారు.
కాగా, సీమాంధ్ర లాయర్ల ఆందోళనకు పార్లమెంటు సభ్యుడు వేణుగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. న్యాయవాదుల దీక్ష శిబిరంలో ఆయన వారికి సంఘీభావం తెలుపుతూ కూర్చుకున్నారు. న్యాయవాదులు తెనాలి కోర్టుకు తాళం వేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేవరకు తమ ఆందోళన సాగుతుందని లాయర్లు చెప్పారు.