హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు నోటీసు జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, స్టూడియో-ఎన్ సిఇఓ లోకేష్ కు లేబర్ కమిషనర్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీలోపల లేబర్ కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్టూడియో-ఎన్ ఛానెల్ దాదాపు 70 మంది ఉద్యోగులను అకారణంగా తొలగించిందని ఎపిడబ్ల్యూజె, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం లేబర్ కమిషనర్'కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై లోకేష్ కు నోటీసు జారీ అయింది.

స్టూడియో ఎన్ నుంచి తమను తీసేయడాన్ని నిరసిస్తూ సిబ్బంది గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది తెలంగాణవారే ఉండడం కూడా వివాదం ముదరడానికి కారణమైంది. ఈ ఉద్వాసనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు సాక్షి టీవీ చానెల్, రాజ్ న్యూస్ టీవీ చానెల్ అండగా నిలిచాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X