హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గద్దర్ వ్యతిరేకం వర్గం తెలంగాణ కమిటీ: విమలక్క సారథ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఫ్రంట్ ఉద్బవించింది. ప్రజా గాయకురాలు విమలక్క నేతృత్వంలో సమిష్టి కార్యక్రమాల నిర్వహణ కమిటీ అనే కొత్త ఫ్రంట్ వచ్చింది. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విమలక్క, కపిలవాయి దిలీప్ కుమార్, కేశవజాదవ్, రవీంద్ర నాయక్ తదితరులు మీడియా సమావేసంలో ప్రకటించారు. అయితే తమది ఫ్రంట్ కాదు అని, కేవలం ఉద్యామాలు చేయటానికి తెలంగాణ కోసం ప్రణాళికలు చేయటానికి మాత్రమేనని ఆమె విమలక్క చెప్పారు. ఇటీవల జరిగిన పరిణామాలు తమను ఈ కమిటీని రూపొందించడానికి వుసిగొల్పాయని ఆమె చెప్పారు. గద్దర్ తో అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ రెండునెలల్లో అవి సమసి పోతాయని అమె అన్నారు. ఒకవేళ రెండునెలల తర్వాత కూడా అభిప్రాయ బేధాలు ఉంటే అప్పటి విషయం ఆలోచిస్తామని అన్నారు. అయితే తాము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మేం ప్రజల్లోనే ఉంటామని అమె చెప్పారు. మే మొదటినుండి ఉద్యమంలోనే ఉన్నామని ఇప్పుడు కూడా ఉద్యమంలో భాగంగానే ఈ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.

ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని తాము కూడా గట్టిగా నమ్ముతున్నామని, అయితే ఎన్నికలను కూడా పోరాట రూపంగా గుర్తించాలనేది తమ అభిప్రాయమని ఆమె అన్నారు. తెలంగాణ సాధన కోసమే తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైరాన్ పల్లిలో పుట్టిన సర్దార్ పాపన్న ఖిలాషాపురంలో ఉండి ఉద్యమాలు చేశాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని త్వరలో ఖిలాషాపురం వెళ్లి అక్కడి పాపన్న విగ్రహం ముందు తెలంగాణ సాధన కోసం ప్రమాణం చేస్తామని చెప్పారు. గద్దర్ తో వ్యతిరేకించిన వర్గం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X