చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిపై క్రిమినల్ కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యుడు, జగన్ వర్గం కాంగ్రెసు నాయకుడు అమరనాథ్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసును దాఖలు చేశారు. గంగవరంలో జరిగిన పార్వేట ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఆయన గాల్లోకి తుపాకీ ఎక్కుపెట్టాడు. దాంతో పోలీసులు ఆయనపై 429, 30, 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. తుపాకి ఆయన కాల్చనప్పటికీ ఎక్కుపెట్టడం కూడా క్రిమినల్ కేసు కిందకే వస్తుంది.

దసరా పండుగ తర్వాత ఆంధ్ర ప్రాంతంలోని కొన్నిచోట్ల పార్వేట ఉత్సవాలు ఉంటాయి. గంగవరంలోని ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమరనాథ్ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయింది. అయితే స్పీకర్ అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు. స్పీకర్ నుండి అనుమతులు రాగానే పోలీసులు అరెస్టు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X