అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెనుకొండలో రక్త చరిత్ర విడుదల నిలిపివేత, అనంతలో ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Rakta Charitra
అనంతపురం: రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమా విడుదలను అనంతపురం జిల్లా పెనుకొండలో పోలీసులు శుక్రవారం నిలిపేశారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నారు. హత్యకు గురైన పరిటాల రవి భార్య పరిటాల సునీత పెనుకొండ శాసనసభా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రక్తచరిత్ర సినిమా విడుదల సందర్భంగా అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమాను సినిమాగానే చూడాలని డిఐజి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సూరి, పరిటాల రవి మధ్య ప్రతీకార జ్వాలలను ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని భావిస్తున్నారు. అయితే, మరో ప్రధాన పాత్ర ఓబుల్ రెడ్డి కూడా ఇందులో ఉన్నాడు. ఓబుల్ రెడ్డిని ఈ సినిమాలో విలన్ గా చూపించారని అంటున్నారు. దీంతో ఓబుల్ రెడ్డి వర్గం వర్మపై తీవ్రంగా మండిపడుతోంది. పరిటాల సునీత, ఓబుల్ రెడ్డి వర్గాల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొని ఉంది. అనంతపురంలో సినిమా చూసేందుకు వర్మ బెంగళూర్ నుంచి అనంతపురం వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమా వల్ల ఫాక్షన్ తగ్గుతుంది, పెరుగుతుంది అనేది ఉత్త మాటేనని మద్దెలచెర్వు సూరి అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X