గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి రోశయ్య సాక్షిగా విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
గుంటూరు: ముఖ్యమంత్రి రోశయ్య గుంటూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు స్కాలర్ షిప్పులు వెంటనే ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెంఘీజ్ ఖాన్ పేట గ్రామంలో ముఖ్యమంత్రి రోశయ్య సభ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి వారిని సముదాయించే ప్రయత్నాలు చేశారు. అయితే వారు రోశయ్య తమకు హామీ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో పోలీసులు విద్యార్థులను ఈడ్చుకెళ్లి స్టేషన్ కు తరలించారు.

కాగా ముఖ్యమంత్రి రోశయ్య వంకాయలపాడులో ఎపిఐఐసి టెక్స్ టైల్స్ పార్కును ప్రారంభించారు. అనంతరం చెంఘీజ్ ఖాన్ పేటలో స్వర్ణ దేవాలయానికి భూమిపూజ చేశారు. గుంటూరు - విజయవాడ మధ్యలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రోశయ్యకు పలువురు న్యాయవాదులు, తెలుగు దేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కొందరు న్యాయవాదులు గుంటూరులో జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X