హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమ్మె బాటపై రైస్ మిల్లర్లకు ముఖ్యమంత్రి రోశయ్య హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: రైస్ మిల్లర్లకు ముఖ్యమంత్రి కె. రోశయ్య హెచ్చరికలు చేశారు. రైతులకు ధాన్యం చేతికొచ్చే సమయానికి సమ్మె చేస్తామని రైస్ మిల్లర్లు అనడం సరి కాదని, నిబంధనలకు లోబడి రైస్ మిల్లర్లు వ్యాపారం చేయాలని ఆయన అన్నారు. రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రబీలో రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చూడాలని కూడా ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

ప్రతి రైతుకు కనీస మద్దతుధర అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రోశయ్య కలెక్టర్లను ఆదేశించారు. రబీలో విత్తన, ఎరువుల సమస్య తలెత్తకుండా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. సూక్ష్మరుణాలపై జారీ చేసిన ఆర్డినెన్స్‌ క్షేత్రస్థాయిలో సరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ బ్యాంకు రుణాలు అందేలా చూడాలని కలెక్టకర్లకు ముఖ్యమంత్రి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X