కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జిల్లాలోని ఓ గదిలో బాంబుపేలుడు: ముగ్గురికి తీవ్రగాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadapa
కడప: కడప జిల్లాలో ఓ నాటు బాంబు పేలటంతో అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎర్రమొక్కపల్లి లోని ఓ సిమెంట్ గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సిమెంట్ గోదాంలోని ఓ గదిలో ఇది చోటు చేసుకుంది. ఘటన జరిగిన స్థలం హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సమీపంలోని సంధ్య థియేటర్ ప్రక్కన జరిగింది.

ఘటనలో గాయపడ్డ ముగ్గురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. సంఘటన జరగగానే యజమాని పరారయ్యాడు. పోలీసులు అక్కడే సూట్ కేసులో ఉన్న మరో 3 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క బాంబు మాత్రమే పేలినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X