కడప జిల్లాలోని ఓ గదిలో బాంబుపేలుడు: ముగ్గురికి తీవ్రగాయాలు
ఘటనలో గాయపడ్డ ముగ్గురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. సంఘటన జరగగానే యజమాని పరారయ్యాడు. పోలీసులు అక్కడే సూట్ కేసులో ఉన్న మరో 3 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క బాంబు మాత్రమే పేలినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Comments
Story first published: Monday, October 25, 2010, 14:08 [IST]