వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇన్, వెంకటస్వామి అవుట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి స్థానం దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత జి. వెంకటస్వామి స్థానంలో పురంధేశ్వరికి స్థానం కల్పించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. వెంకటస్వామి పార్టీ బలోపేతానికి ఏ మాత్రం ఉపయోగపడడం లేదని ఆమె భావిస్తున్నారని, అందువల్ల చురుగ్గా తిరిగి పార్టీని బలోపేతం చేసే వారిని సిడబ్ల్యుసిలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందువల్ల పురంధేశ్వరికి స్థానం కల్పించే విషయంపై సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, ఇటీవలి కాలంలో తెలంగాణకు చెందిన కె. కేశవ రావు ప్రాబల్యం అధిష్టానం వద్ద పెరిగింది. ఆయన వర్కింగ్ కమిటీలో ఉంటారని అంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) పదవి నుంచి తప్పుకుంటున్న డి. శ్రీనివాస్ కు కూడా ఎఐసిసిలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి కేశవరావు, వి. హనుమంతరావు, డి. శ్రీనివాస్ లకు ఏదో విధంగా స్థానాలు కల్పించాల్సిన అవసరం అధిష్టానానికి ఏర్పడిందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X