తిరుమల శ్రీవారికి రూ. 15 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన నటి కాంచన
అంతేకాకుండా, తమ కూతురు చెడిపోయిందని, ఎవరు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని కూడా తల్లిదండ్రులు ప్రచారం సాగించారు. ఈ విషయాన్ని కాంచన స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దాంతో ఆమె సినీ రంగాన్ని వదిలేసి, సామాజిక సేవలో మునిగిపోయారు. ఆమె బెంగళూరులో ఉంటూ దేవాలయాలను శుభ్రం చేస్తూ, నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. సుదీర్షమైన న్యాయపోరాటం ద్వారా తల్లిదండ్రుల నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసే తన ఆస్తిని ఆమె పొందారు. సోదరి గిరిజతో కలిసి ఆమె తన ఆస్తిని టిటిడికి అందించారు. టిటిడి తరఫున ఆ విరాళాన్ని మంగళవారం వారి నుంచి ఇవో కృష్ణారావు అందుకున్నారు. కాంచన 1960 - 70 మధ్య కాలంలో పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె అందానికి అప్పట్లో ప్రేక్షకులు మైమరిచిపోయే వారు.
Story first published: Tuesday, October 26, 2010, 17:10 [IST]