రామలింగేశ్వరుడి దగ్గర చిరుతల కలకలం: ఆందోళనలో భక్తులు
దేవాలయం దగ్గర ఉన్న ట్యాంకు దగ్గర అవి ఉంటున్నాయి. దీంతో భక్తులు, దేవాలయంలోని పూజారి భయాందోళనకు గురువుతున్నారు. అయితే ఐదు రోజులుగా వస్తూ అవి ఏ హానీ చేయడం లేదు. దేవాలయ ఆవరణలోనే ఉన్న పూజారి కుటుంబం ఎప్పుడూ తలుపులను బిగించుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. గ్రామం సైతం దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్నప్పటికీ గ్రామస్తులూ ఆందోళన చెందుతున్నారు. ఓ యాభై మంది కలిసి పులుల దగ్గరకు వెళితే అవి భయపడి పారిపోతున్నాయని దేవాలయ పూజారి రాజేంద్రప్రసాద్ అంటున్నారు. అటవీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని అయితే వారినుండి ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు.
Comments
Story first published: Tuesday, October 26, 2010, 10:39 [IST]