అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామలింగేశ్వరుడి దగ్గర చిరుతల కలకలం: ఆందోళనలో భక్తులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiruta Puli
అనంతపురం: అనంతపురం జిల్లాలో రెండు చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. వజ్రకరూరు మండలం రామాపురం గ్రామం దగ్గరలో జేరుట్ల వద్ద దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం వద్దకు గత ఐదు రోజులుగా రెండు చిరుతలు వస్తున్నాయి. రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో వచ్చి అక్కడే నిద్రిస్తున్నాయి. అ తర్వాత ఉదయం ఆరుగంటలకు లేచి పదిగంటల వరకు అక్కడే ఉంటున్నాయి.

దేవాలయం దగ్గర ఉన్న ట్యాంకు దగ్గర అవి ఉంటున్నాయి. దీంతో భక్తులు, దేవాలయంలోని పూజారి భయాందోళనకు గురువుతున్నారు. అయితే ఐదు రోజులుగా వస్తూ అవి ఏ హానీ చేయడం లేదు. దేవాలయ ఆవరణలోనే ఉన్న పూజారి కుటుంబం ఎప్పుడూ తలుపులను బిగించుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. గ్రామం సైతం దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్నప్పటికీ గ్రామస్తులూ ఆందోళన చెందుతున్నారు. ఓ యాభై మంది కలిసి పులుల దగ్గరకు వెళితే అవి భయపడి పారిపోతున్నాయని దేవాలయ పూజారి రాజేంద్రప్రసాద్ అంటున్నారు. అటవీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని అయితే వారినుండి ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X