వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కింగ్ ఫిషర్ విమానంలో సహ ప్రయాణికులతో నటి అనుష్క గొడవ

By Pratap
|
Google Oneindia TeluguNews

Anushka Sharma
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ముంబై - ఢిల్లీ విమానంలో బ్యాండ్, బాజా, బారాత్ సినిమా నటులు అనుష్క శర్మ, రణవీర్ సింగ్ ఐపియస్ అధికారి అయిన సహ ప్రయాణికుడితో గొడవకు దిగారు. ఇద్దరు ప్రయాణికులతో అనుష్క తీవ్ర వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. వారిలో ఒకరు మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి. విమానం ఢిల్లీలో దిగబోతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారు టర్మినల్ వద్దకు వచ్చిన తర్వాత రణవీర్ గొడవకు దిగాడు. ఈ సంఘటనను కింగ్ ఫిషర్ సిబ్బంది తమ దృష్టికి తెచ్చారని, అయితే ఫిర్యాదు మాత్రం చేయలేదని పోలీసులు చెప్పారు.

రణవీర్, అనుష్క కింగ్ ఫిషర్ విమానంలో ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్నారని, అనుష్క పక్కన కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారని, దానికి ఆమె అభ్యంతరం చెప్పారని, దాంతో గొడవ జరిగిందని కింగ్ ఫిషర్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో దిగిన తర్వాత టెర్మినల్ వరకు తమకు వేరే వాహనాలు ఇవ్వాలని ఆ ఇద్దరు ప్రయాణికులు అడిగారని, సిబ్బంది అందుకు అంగీకరించి వేరే వాహనం ఏర్పాటు చేశారని, అయితే రణవీర్ ఆ వాహనంలోకి దూసుకెళ్లి వారితో గొడవకు దిగారని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X