వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియా సునామీ, లావాలకు 137 మంది బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Tsunami
జకార్తా: ఇండోనేషియాలో సునామీ, లావా బీభత్సం సృష్టించింది. శక్తివంతమైన భూకంపం రావడంతో ఇండోనేషియాలో సునామీ వచ్చింది. ఈ దుర్ఘనటలో దాదాపు 137 మంది మరణించగా, 500 మంది జాడ తెలియడం లేదు. ఇండోనేషియాలోని పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. సుమత్రా దీవుల్లోని మెంటవాయిలో సోమవారం భారీ భూకంపం వచ్చింది. ఇది రిచర్ స్కేలుపై 7.7గా నమోదైంది. దాదాపు 112 మంది మరణించారని, మరో 502 మంది జాడ తెలియడం లేదని సుమత్రా డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెదడ్ హార్మేన్సే చెప్పారు. అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడిన లావాతో మరో 25 మంది మృతి చెందారు.

సునామీ ఎగిసిపడిన 24 గంటల లోపే జావాలోని మెరపి పర్వతం లావాను ఎగజిమ్మింది. దాంతో వేలాది భయంతో పారిపోయారు. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మూడు సార్లు అగ్నిపర్వతం లావా ఎగజిమ్మిందని, దాంతో వేడి మబ్బులు కిందికి పాకాయని ప్రభుత్వ వోల్కానలిజిస్టు సురోనో చెప్పారు. నిరుడు సెప్టెంబర్ లో వచ్చిన 7.6 భూకంపానికి 1,100 మంది మరణించిన విషయం తెలిసిందే. సునామీకి పది గ్రామాలు తుడిచిపెట్టుకు పోయినట్లు అధికారులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X