కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేడుకలలో పాల్గొంటామన్న కోమటిరెడ్డిపై కెటిఆర్ పైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
కరీంనగర్: రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించగానే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నవంబర్ 1న మంత్రులైనా, ఎవరైనా అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటే వారిని తెలంగాణ ద్రోహులుగా పేర్కొంటామని ఆయన హెచ్చరించారు. నల్లగొండలో కోమటిరెడ్డి వాఖ్యలు చేసిన గంటలోపే ఆయన స్పందించారు.

మంత్రులు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం అధికారికంగా తెలంగాణలో అవతరణ దినోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు విముక్తి కలిగిన సెప్టెంబర్ 17ను అధికారికంగా చేయని ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఢిల్లీ యాత్రను ఆ పార్టీ ఆధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆమోదిస్తున్నాడా అనే విషయాన్ని ప్రకటించాలని కోరారు. అప్పుడే మేం తెలుగు దేశాన్ని నమ్మేది నమ్మొద్దా అని నిర్ణయించుకునే అవకాశం ఉంటుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X