హైకోర్టు బెంచ్ కు ఉద్యమం ఉధృతం చేస్తాం: సీమాంధ్ర లాయర్లు
కాగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ బుధవారం గుంటూరు జిల్లా న్యాయవాదులు, ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా బంద్ ను నిర్వహించాయి. భారతదేశంలో పెద్దగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ లు ఉండగా దక్షిణ భారతదేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బెంచ్ ఏర్పాటు చేయకపోవటం ఏమిటని లాయర్లు ప్రశ్నించారు. 56 సంవత్సరాలుగా హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించటం లేదని వారు ఆరోపించారు.
Comments
Story first published: Wednesday, October 27, 2010, 11:44 [IST]