విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు బెంచ్ కు ఉద్యమం ఉధృతం చేస్తాం: సీమాంధ్ర లాయర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
విజయవాడ: విజయవాడ - గుంటూర్ల మధ్య హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టిన లాయర్లు నిరాహార దీక్షను విరమించారు. అయితే తాము పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి బెంచ్ ని సాధించుకుంటామని చెప్పారు. ఇప్పుడు లాయర్లకు ప్రజలు కూడా తోడయ్యారని, అందరం కలిసి హైకోర్టు బెంచ్ కోసం పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు.

కాగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ బుధవారం గుంటూరు జిల్లా న్యాయవాదులు, ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా బంద్ ను నిర్వహించాయి. భారతదేశంలో పెద్దగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ లు ఉండగా దక్షిణ భారతదేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బెంచ్ ఏర్పాటు చేయకపోవటం ఏమిటని లాయర్లు ప్రశ్నించారు. 56 సంవత్సరాలుగా హైకోర్టు బెంచ్ కోసం పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించటం లేదని వారు ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X