హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర న్యాయవాదుల డిమాండ్ న్యాయమైనదే: మంత్రి మోపిదేవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: సీమాంధ్ర లాయర్లు హైకోర్టు బెంచ్ కోసం చేస్తున్న ఉద్యమం న్యాయబద్దమైనదేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ విలేకరుల సమావేశంలో అన్నారు. అయితే వారు చేస్తున్న ఉద్యమానికి ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని లాయర్లు తమ ఆందోళన విరమించుకోవాలని కోరారు. హైకోర్టు బెంచ్ కోసం ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ప్రకటించారు. అయితే ఈ విషయం రాష్ట్రంలో ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్నది. ఇది లాయర్లకు కూడా తెలుసు. చాలా అంశాలతో ముడిపడి ఉన్నందున బెంచ్ కు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని చెప్పారు.

ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్ల విక్రయాల లోటుపాట్ల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఇంకా అందలేదన్నారు మంత్రి మోపిదేవి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐఐఐటి అడ్మిషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవ్నారు. ఐఐఐటి అడ్మిషన్ల లోటుపాట్లపై హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత వాటిని పరీశీలించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X