హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్త చరిత్ర 2లో రామ్ గోపాల్ వర్మ టార్గెట్ వైయస్ జగన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర-2లో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను టార్గెట్ చేసుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 1990 దశకం చివరలో ఓ పని మీద వైయస్ జగన్ అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో తెలుగుదేశం దివంగత శాసనసభ్యుడు పరిటాల రవి అనుచరులతో ఆయనకు ఘర్షణ చెలరేగింది. వైయస్ జగన్ అవమానానికి గురయ్యారని చెబుతారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటానని అప్పట్లో జగన్ అన్నట్లు సమాచారం. దాన్ని రామ్ గోపాల్ వర్మ తన రక్తచరిత్ర రెండో భాగంలో వాడుకున్నట్లు తెలుస్తోంది.

రక్త చరిత్ర రెండో భాగంలో పరిటాల రవి హత్యలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి, మద్దెలచెర్వు సూరి తదితర కాంగ్రెసు నాయకులు ఎలాంటి పాత్ర నిర్వహించారనేది కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, వైయస్ జగన్ ను మంచి వ్యక్తిగా చిత్రీకరించారా, చెడు వ్యక్తిగా చూపించారా అనేది తేలాల్సి ఉంది. ఏమైనా, రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలు రక్తచరిత్రలో ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నాయనేది వివాదంగానే మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X