చిరంజీవికి శోభారాణి మరో షాక్: సమావేశం బాయ్ కాట్
వెనకబడిన, ఎస్సీ మహిళల సమస్యలపై మాట్లాడడానికి శోభారాణి ముందుకు వచ్చే వరకు అంతా సజావుగానే జరిగిపోయింది. ఆ అంశం ఎజెండాలో లేదని కాంగ్రెసు నేతలతో పాటు ఆమె సొంత పార్టీ నేతలు కూడా శోభారాణిని వ్యతిరేకించారు. ఆమె తన పట్టు విడిచిపెట్టలేదు. తగాదాకు దిగారు. సమావేశం నుంచి ఆగ్రహంగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసువారే కాకుండా తన సొంత పార్టీ మహిళా నేతలు కూడా తనను అవమానించారని ఆమె విమర్శించారు. శోభారాణి తీరును ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు తప్పు పట్టారు. తామే సమావేశం ఏర్పాటు చేసినందున శోభారాణి తీరు వల్ల ఇతర పార్టీలు నొచ్చుకుంటాయని, శోభారాణికి అవమానం జరగలేదని, చిరంజీవికి ఆమె వల్ల అవమానం జరిగిందని ఆయన అన్నారు.
Story first published: Wednesday, October 27, 2010, 15:52 [IST]