వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వరూపానంద కేసు: ఎన్టీవీ కీలక వ్యక్తుల అరెస్టుకు రంగం సిద్ధం?

By Pratap
|
Google Oneindia TeluguNews

NTV
హైదరాబాద్: విశాఖపట్నం శారదా పీఠం స్వామి స్వరూపానంద కేసులో తెలుగు ప్రైవేట్ టీవీ చానెల్ ఎన్టీవి ప్రతినిధులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను బ్లాక్ మెయిల్ చేశారని స్వరూపానంద చేసిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పెందుర్తి పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎన్టీవి విశాఖపట్నం విలేకర్లు శ్రీరాంరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. వారిద్దరు స్వరూపానందను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఆధారంగా తనపై తప్పుడు వార్తాకథనాలు ప్రసారం చేసి, తనను బ్లాక్ మొయిల్ చేశారని స్వరూపానంద హైదరాబాదులో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి, డిజిపికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత కేసు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసును ఆ తర్వాత పెందుర్తికి బదిలీ చేశారు.,br />
ఎన్టీవికి చెందిన కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు పెందుర్తి పోలీసులు హైదరాబాదు చేరుకున్నారు. వారు మంగళవారం రాత్రే హైదరాబాదు చేరుకున్నారు. స్వరూపానంద ఫిర్యాదులో పేర్కొన్న ఎన్టీవికి చెందిన రాజశేఖర్, నరేంద్రనాథ్ చౌదరి, శాస్త్రిలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, వారు పోలీసుల కంట పడకుండా బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X