హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటమి కప్పిపుచ్చుకోవడానికే ఐటి దాడులు: వెంకయ్యనాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
హైదరాబాద్: కాశ్మీరుపై అరుంధతీరాయ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ చేస్తున్న పిడివాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. అమె కాశ్మీరు వేషయంలో అసంబద్ధ వాఖ్యలు చేస్తుందని విమర్శించారు. ఈ తరహా ప్రకటనలు చేసే వారిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపై ఇన్ కమ్ టాక్సు డిపార్టుమెంటు చేస్తున్న దాడులు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జెడి(ఎస్)లు కలికి యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయని, అయితే వారి ఆశలు నెరవేరక పోవటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఓటమిని జీర్ణించుకోలేకనే ఈ దాడులు చేయిస్తుందన్నారు. వారి ఓటమిని కప్పి పుచ్చుకొని భాజపా ప్రభుత్వంపై తప్పును తోయడానికే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X