హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి కాళ్లు మొక్కడానికి మేం రెడీ: జీవితా రాజశేఖర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jeevitha
హైదరాబాద్: బ్లడ్ బ్యాంక్ విషయంలై తాము చెప్పింది తప్పని తేలితే తాము ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాళ్లు మొక్కడానికి సిద్ధంగా ఉన్నామని సినీ హీరో రాజశేఖర్ భార్య జీవిత అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆమె తొలిసారి మీడియా ప్రతినిధుల వద్ద ప్రతిస్పందించారు. చిరంజీవి ఓవరాక్షన్ చేశారని ఆమె బుధవారం సాయంత్రం వ్యాఖ్యానించారు. బ్లడ్ బ్యాంక్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆరెంజ్ ఆడియా విడుదల సందర్భంగా చిరంజీవి తన భుజాన్ని తానే తట్టుకున్నారని, తాము చెప్పిన విషయాలపై విచారణే జరగలేదని, చిరంజీవి ఓవరాక్షన్ చేశారని ఆమె అన్నారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫార్స్ అని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మంచి వాణిజ్యపరమైన బ్లడ్ బ్యాంక్ అని మాత్రమే చెప్పామని ఆమె అన్నారు. ఎయిడ్స్ - బ్లడ్ బ్యాంక్ అంశంపై మాత్రమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందని, బ్లడ్ బ్యాంక్ ఎయిడ్స్ స్క్రీనింగ్ మార్దదర్శకాలను పాటిస్తోందని, ఆడిట్ సరిగ్గా జరుగుతోందని మాత్రమే విచారణ కమిటీ తేల్చిందని ఆమె అన్నారు. ప్రజలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉచితంగా రక్తం అందించడం లేదనేదే తమ అభ్యంతరమని ఆమె చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉచితంగా 20 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని బ్లడ్ బ్యాంక్ పొందిందని, దాని విలువ ఏడాదికి 30 లక్షల రూపాయలు ఉంటుందని ఆమె అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేస్తుందా, లేదా అనే విషయంపై విచారణ కమిటీ దృష్టి పెట్టలేదని ఆమె అన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉచితంగా రక్తం ఇస్తున్నామని తేలిస్తే తాను, తన భర్త చిరంజీవి కాళ్లు మొక్కడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X