నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆదుకున్న వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nallapureddy Prasannna Kumar Reddy
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆదుకున్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో ఆయన పాల్గొంటున్న విషయం తెలిసిందే. కొవ్వూరు శాసనసభా నియోజకవర్గంలోని ఓ గ్రామంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాన్ని కాంగ్రెసు కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వైయస్సార్ విగ్రహాన్ని అవిష్కరించడమేమిటని వారు అడ్డు తగిలారు. ఈ సమయంలో వైయస్ జగన్ జోక్యం చేసుకున్నారు.

మైక్ తీసుకుని అడ్డు చెబుతున్న కాంగ్రెసు కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినవారే అయినా తన గ్రూపునకు చెందినవారని, పైగా ప్రసన్నకుమార్ రెడ్డి ఆనం సోదరుల వంటి కాంగ్రెసు నాయకుల కన్నా నయమని జగన్ అన్నారు. ఆనం బ్రదర్స్ వైయస్సార్ పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. దాంతో ప్రసన్న కుమార్ రెడ్డి పట్ల కాంగ్రెసు కార్యకర్తలు సానుకూలంగా ప్రతిస్పందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X