వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసిన రైతులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పత్తికి మద్దతు ధర లభించటం లేదని ప్రత్తి రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కిటికీలో పగులగొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పత్తి 4వేల రూపాయలకు పైగా పలుకుతుండగా ఇక్కడ అంతకు తక్కువ కొనడంపట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎనుమాముల పక్కనే ఉన్న పరకాల, తొర్రూరు మార్కెట్లలో పత్తిని మద్దతు ధరకు కొంటున్నప్పటికీ ఇక్కడ మాత్రమే మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు మద్దతు ధర లభించే వరకు ఆందోళన చేస్తామని అంటున్నారు. అయితే మార్కెట్ కేవలం మధ్యవర్తి మాత్రమేనని, ధరను మేం నిర్ణయించలేమని అధికారులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X