70: 30 శాతానికి ప్రభుత్వం ఓకే: సాయంత్రం జీవో జారీ!
రాష్ట్ర వ్యాప్తంగా 30,803 పోస్టులు అవసరం కాగా తొలివిడతలో 26,700 ఎస్జీటీ పోస్టులను, 1149 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. శనివారం నుండి కౌన్సిలింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై బీఇడి విద్యార్థులు అసంతృప్తితో ఉంటారని తెలుసునని అయితే వారు న్యాయం జరగలేదని అనుకుంటే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. కోర్టు ఆదేశాలను మేం పాటించాం. బీఇడి వారు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లి తస సమస్యను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు.
కాగా ప్రభుత్వం నిర్ణయం పట్ల బిఇడి విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రభుత్వం చేసిన తప్పులకి బిఇడి విద్యార్థులు బలవుతున్నారని, ఇప్పటికై న్యాయం కోసం మేము నిరాహార దీక్షలు చేశామని అయితే ప్రభుత్వం హామీలు ఇచ్చి దీక్షలు విరమింప చేసిందని ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా బిఇడి విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఇడి విద్యార్థులు సెక్రటరియేట్ ను ముట్టడించడానికి సిద్ధమయ్యారు.