వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి పదవిపై ఆశ పడుతున్న వైయస్ జగన్ కు మొండిచెయ్యే?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మొండిచేయి చూపే ఉద్దేశంతోనే ఉన్నట్లు సమాచారం. తక్షణమే ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యాన్ని ఆయన మార్చుకున్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ వర్గానికి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహా శాసనసభ్యురాలు కొండా సురేఖ చెప్పారు. అందుకే, పిసిసి అధ్యక్షుడి నియామకం జరిగే వరకు వేచి ఉండాలనే ఉద్దేశంతో జగన్ వర్గం ఉంది. అయితే, ఇప్పటికే అధిష్టానం మనసెరిగిన జగన్ మాత్రం ఆ పదవి తనకు దక్కదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తును ఇప్పటికే ఆయన నిర్ణయించుకున్నప్పటికీ పిసిసి నియామకం జరిగే వరకు వేచి ఉండాలనే సన్నిహితలతో సలహాను పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అందువల్లనే ఆయన ముఖ్యమంత్రి రోశయ్యపై గానీ పార్టీ అధిష్టానంపై గానీ విమర్శలు చేయడం లేదని అంటున్నారు.

పార్టీ అనుబంధ యువజన కాంగ్రెసు కమిటీలను రద్దు చేయడంపై వైయస్ జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కు మద్దతిస్తుండడం వల్లనే వాటిని రద్దు చేశారని ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు మండిపడ్డారు. యువజన కాంగ్రెసు కమిటీల పునర్నియామకం వ్యవహారం కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో జగన్ పై అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. జగన్ పై అభిప్రాయం అడుగుతూ ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా అనే విషయాన్ని రాబడుతున్నారు. వ్యతిరేకంగా ఉన్నవారికి మాత్రమే స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అనుకూలంగా ఉన్నవారిని పక్కన పెడుతున్నారని వినికిడి. ఈ వ్యవహారాన్ని బట్టి జగన్ పట్ల పార్టీ అధిష్టానం ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు. అందువల్ల పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ స్థానంలో జగన్ ను నియమించే అవకాశాలు ఎంత మాత్రం లేవని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X