వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీవీ9పై పరువు నష్టం దావా: ప్రసారాలు నిలిపేయాలని ఆదేశం
పుణే సమీపంలో తాము నిర్మిస్తున్న టౌన్షిప్పై టీవీ9 అభ్యంతరకర కథనాలను ప్రసారం చేసిందని లావాసా తన పిటిషన్లో ఆరోపించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు సదరు చానల్ ఐదు కథనాలను ప్రసారం చేసిందని, అవి తమ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. రాజకీయ నేతల వాటాలు ఉండడం వల్లే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు భూమిని మంజూరు చేసిందని ఆ కథనాల్లో తప్పుడుగా ప్రసారం చేసిందని పిటిషన్లో పేర్కొంది. ప్రాజెక్టు కోసం తాము 9,500 ఎకరాలను మార్కెట్ రేటు చొప్పున ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని తెలిపింది. ప్రజల ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి లాభాన్ని చేకూర్చడమేకాకుండా రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పెరిగేందుకు కూడా దోహదపడుతుందని చెప్పింది.
Story first published: Saturday, October 30, 2010, 10:01 [IST]