వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతిని ఏకం చేసిన మహోన్నతుడు వల్లభాయ్ పటేల్: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: జాతిని ఏకత్రాటిపైకి తెచ్చేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా కృషి చేశాడని ముఖ్యమంత్రి రోశయ్య అన్నాడు. ఆదివారం ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ విగ్రహానికి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. మహాత్ముడు జన్మించిన గుజరాత్‌లోనే ఆయన జన్నించాడన్నారు. పటేల్‌ స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొని చాలామందిని ప్రభావితం చేశారని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం 500 పైగా స్వదేశీసంస్థానాలను భారత్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. హైదరాబాద్‌ను నిజాం పాలననుంచి విముక్తి చేయడంలోనూ జునాగఢ్‌, కాశ్మీర్‌ విముక్తి పోరాటాల్లోనూ ఆయన నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. నిజాం చివరి ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సర్దార్ పటేల్ కు తలవంచి తన సంస్థానాన్ని భారత్ లో కలిపాడని గుర్తు చేశారు. దేశ ఉపప్రధానిగా, దేశ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన కోట్లాదిమంది భారతీయులకు ఆరాధ్యుడు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జరిపారు. బడుగు బలహీన వర్గాలకు ఇందిర స్ఫూర్తి ప్రధాత అని, బ్యాంకులను జాతీయం చేసిన గొప్ప నాయకురాలన్నారు. అలాంటి గొప్ప వంశం నుండి వచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని అవి సరికావని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X