హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మందా జగన్నాథానికి అవమానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథానికి అవమానం జరిగింది. నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్థులకు మద్దతివ్వడానికి వచ్చిన మందా జగన్నాథాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. మీలోనే ఐక్యత లేదంటూ ఆయనను విద్యార్థులు నిలదీశారు. మందా జగన్నాథం చేత విద్యార్థులు తెలంగాణ నినాదాలు చేయించారు. తెలంగాణ నినాదాలు చేసి ఆయన వెనుదిరిగారు.

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X