వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణవాదుల రాస్తారోకో, ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalgonda district
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. రాష్ట్రావతరణ దినోత్సవాలను నిరసిస్తూ తెలంగాణ సంఘాల కార్యకర్తలు నల్లగొండ జిల్లాలోని నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకారులు ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ వంతెనపై ఆందోళనకారులు బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో మార్గం గుండా వెళ్లే అవకాశం లేదు. ఆందోళనకారులను సముదాయించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాదు శివారులో విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ రాస్తారోకో చేశారు. ఆయనను పోలీసులు అరెస్టుచేశారు.

కాగా, జిల్లాలోని రాష్ట్రావతరణ దినోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మకు ఆందోళనకారులు సమాధి కట్టారు. నల్లగొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అవతరణ దినోత్సవాలను అడ్డుకోవడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X